నవతెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్యను కాంగ్రెస్ నాయకులు జంగిడి సమ్మయ్య,జనగామ బాపు,బత్తుల తిరుపతి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం మళ్ళీ పాత పాలక వర్గాలకు పగ్గాలు అప్పజెప్పిన నేపథ్యంలో మొoడయ్య మళ్ళీ చైర్మన్ బాధ్యతలు చేపట్టడం ద్వారా తాడిచెర్ల సొసైటీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.

The post పిఏసీఎస్ చైర్మన్ మొండయ్యకు కాంగ్రెస్ నాయకుల సన్మానం appeared first on Navatelangana.