భారత్ సెమీకండక్టర్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న అత్యాధునిక చిప్ సాంకేతికత ఇప్పుడు మన దేశంలోనే.. అది కూడా ఒడిశా గడ్డపై రూపుదిద్దుకోనుంది. భువనేశ్వర్‌లోని ఇన్ఫో వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్‌కు శంకుస్థాపన జరిగింది.