14262 articles

భార్య భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపిన సంఘటన నిజామాబాద్ నగర శివారు ప్రాంతమైన న్యాల్కల్ లో చోటుచేసుకుంది. న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అతను లేని సమయంలో అతని భార్య సంధ్య, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ నుండి తిరిగి రావడంతో సంధ్య తన అక్రమ బంధానికి భర్త అడ్డుగా మారాడని భావించింది. భర్తను వదిలించుకోవడానికి సంధ్య తన ప్రియుడు మరియు స్థానికుడైన వెంకట సాయితో కలిసి ప్లాన్ వేసింది. భర్త ప్రశాంత్కు మందు తాగించి భవనంపై నుంచి కిందకు తోసేశారు. కింద పడటంతో ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.ఆసుపత్రిలో ఎవరూ లేని సమయం చూసి బాత్రూమ్ క్లీనర్గా వాడే హార్పిక్ లిక్విడ్ను సిరంజి ద్వారా అతని నరాల్లోకి ఎక్కించింది. కెమికల్ శరీరం మొత్తం పాకడంతో అవయవాలు విఫలమై ప్రశాంత్ తీవ్ర నరకయాతన అనుభవిస్తూ ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ప్రశాంత్ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు వెంకట సాయిని అదుపులోకి తీసుకుని తమ శైలిలో వి


కుక్క పిల్లలకు పంది పాలు ఇచ్చిన వింత ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం లోని కోసిగి మండలం జంపాపురంలో చోటు చేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలు తన తల్లీ లేక పోవడంతో పంది పాలు తాగడానికి ముందుకు వచ్చినవి. అయితే పంది కూడా వాటికీ చక్కగా పాలు ఇస్తూ సహకరించడం చూసి గ్రామస్తులు అందరు ఆశ్చర్యపోయారు. సాధారణంగా కుక్కలు, పందులు ఒకదానికొకటి పడవు. కానీ, ఇక్కడ ప్రకృతి విరుద్ధంగా ఆ పంది అనాథ కుక్క పిల్లలకు ప్రేమగా పాలు ఇవ్వడం స్థానికులను, భక్తులను ఆశ్చర్యపరిచింది.

హైదరాబాద్: పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బండి భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న భగీరథ్.. బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం కోర్టులో భగీరథ్ పిటీషన్ పై కీలక వాదనలు జరిగాయి. ఈ కేసులో బెయిల్ ఇస్తే.. బండీ భగీరథ్, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని బాధితుల తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.


గుజరాత్లోని భావ్నగర్ జిల్లా గరాజియా గ్రామంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పొదల్లో దాక్కున్న సింహం అకస్మాత్తుగా ఓ పశువుల కాపరిపై దూకి దాడి చేసింది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో సింహం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

కొలంబో: శ్రీలంకలోని తీరపట్టణంలో ఉన్న నెగోంబో జైలులో ఘర్షణల్లో 25 మంది మృతి చెందారు. ఈ జైలులో ఆదివారం ఇరువర్గాలకు చెందిన ఖైదీల గుంపుల మధ్య కొట్లాట జరిగింది. ఇది క్రమేపీ హింసాత్మకం అయింది. రక్తపాతానికి దారితీసింది. రెండు వర్గాలు ఆవేశాలతో మరుసటి రోజు సోమవారం కూడా బాహాబాహీకి దిగాయి. కర్రలు , గునపాలతో పరస్పరం దాడులకు దిగారని వెల్లడైంది. ఘర్షణల్లో వంద మందికి పైగా గాయపడ్డారు. చాలా కాలంగా ఇక్కడి జైలులో రెండు వర్గాల మధ్య తరచూ తగాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. జైలులో డ్రగ్స్ అక్రమ పంపిణీకి దిగుతున్న గ్యాంగ్ను , దీనిని అడ్డుకుంటున్న ఇతర ఖైదీల మధ్య తరచూ ఘర్షణలు జైలులో అశాంతికి దారితీస్తోంది. ఘర్షణల అదుపు ఇప్పుడు జైలులోని భద్రతా సిబ్బందితో సాధ్యం కావడం లేదు. దీనితో ఇక్కడ భద్రతను కాపాడేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు (ఎస్టిఎఫ్)ను రంగంలోకి దింపారు. ఇప్పటి ఘటనలు రక్తపాతంపై జైళ్ల శాఖ దర్యాప్తు చేపట్టింది.

కీవ్ : రష్యా సోమవారం ఉక్రెయిన్పై భీకరస్థాయిలో క్షిపణులు, డ్రోన్ల తో ప్రతీకార దాడికి దిగింది. తమ దేశ చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడుల తరువాతి తీవ్ర పరిణామాలతో రష్యా విరుచుకుపడింది. కీవ్ పరిసరాలను ఎంచుకుని సోమవారం నాటి దాడులలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డట్లు వెల్లడైంది. ఉక్రెయిన్ వైమానిక భద్రతా వ్యవస్థ పేలవంగా ఉందనే విషయం ఇప్పుడు రష్యా సాగించిన దాడులతో స్పష్టం అయింది. ఈసారి రష్యా ఉక్రెయిన్పై దాదాపుగా అన్ని కూడా బాలిస్టిక్ మిస్సైల్స్ను ప్రయోగించింది. ప్రస్తుతం ఉక్రెయిన్కు క్షిపణులను తట్టుకుని చిత్తు చేసే పాట్రియాట్ విచ్ఛేదక వ్యవస్థ కొరత ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని రష్యా ఇప్పుడు కీవ్ ఇతర ప్రాంతాలపై అత్యంత శక్తివంతమైన దాడులకు దిగిందని వెల్లడైంది. రష్యా నుంచి ఇక ఎప్పుడైనా అత్యంత తీవ్రస్థాయి దాడులు తప్వవని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ విశ్లేషించిన కొద్ది గంటల్లోనే దాడులు జరిగాయి. కీవ్లో విధ్వంసం జరిగింది. కుప్పకూలిన భవంతులు, దెబ్బతిన్న వాణిజ్య సముదాయాల శిధిలాలను తొలిగించేందుకు సహాయక బృందాలు తరలివచ్చాయి. పలు చోట్ల బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితి దారుణంగా మారిం

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి సోమవారం ఇ మొయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో బెంగళూరులోని ఈ కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితమే ఇస్రోకు ఇదే విధమైన బెదిరింపు వెలువడింది. విస్తృత సోదాల తరువాత ఈ బెదిరింపు ఉత్తుత్తిదే అని తేలింది. దీనితో ఇస్రో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. స్థానిక పోలీసులు, డాగ్స్కాడ్, బాంబు డిటెక్షన్ డిస్సోజల్ బృందాలు తరలివచ్చాయి. దీనితో స్థానిక న్యూ బెల్ రోడ్లోని ఇస్రో కార్యాలయ పరిసరాలలో కొద్ది సేపు కలకలం చెలరేగింది. ఇస్రో కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఇమొయిల్ ద్వారా తెలియచేసిన వ్యక్తుల వివరాలను రాబట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఈ నెల రెండవ తేదీన కూడా ఇటువంటి బూటకపు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ రెండు బెదిరింపులకు ఏదైనా లింక్ ఉందా? అనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. గత వారం వెలువడిన బెదిరింపు ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నుంచి అని నిర్థారించారు. అప్పటి దర్యాప్తు క్రమంలో ఈ బెదిరింపునకు దిగిన వ్యక్తికి మతిస్థిమ





హైదరాబాద్: కాళేశ్వరం కట్టింది, ఓపెన్ చేసింది బిఆర్ఎసేనని.. కూలింది తమ హయాంలోనే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే..కాళేశ్వరానికి ఈ గతి పట్టేది కాదని అన్నారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై పొంగులేటి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం కట్టడానికి బిఆర్ఎస్ ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లు వచ్చాయి కానీ పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి వారికి మనసు రాలేదని పొంగులేటి మండిపడ్డారు. బిఆర్ఎస్ సలహాలు, సూచనలు ఇస్తామంటే అసెంబ్లీ పెడతామని, కాళేశ్వరం ఎనిమిదో వింత అన్న పెద్దమనిషి అసెంబ్లీకి రావాలని సూచించారు. బిఆర్ఎస్ చేసిన పాపాలన్నీ చెప్పి అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని, ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరంపై వివరణ ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.








