మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 12 రోజుల తర్వాత భారీ దొంగ తనాన్ని ఛేదించారు జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలను‌ జల్లెడ పట్టిన పోలీసులు.. అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తులను‌ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది..