వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల ప్రభావం కేవలం మనుషులపైనే కాకుండా మూగజీవులపై కూడా తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పెంపుడు కుక్కలు చాలా సులభంగా వడదెబ్బకు గురవుతున్నాయి. అయితే చాలామంది యజమానులు ఈ విషయాన్ని సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.