ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లు తాము ఎవరికి ఓటేశారో బహిరంగంగా వెల్లడించకూడదు. కానీ నటుడు వీటీవీ గణేష్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తాను ఎవరికి ఓటు వేశాడో మీడియా ముఖంగా చెప్పేశాడు. అంతేకాదు యువత అందరూ ఆ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చాడు.