బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. హైదరాబాద్ నగరానికి కి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. 2012 లో గుంటూరు నగరం పరిసరాల్లో ఉన్న పది గ్రామాలని గుంటూరు లో కి కలిపి దీనిని అతి పెద్ద నగరంగా ఈ నగరం యొక్క హద్దులని విస్తరింపచేసారు.
అభ్యాసం మరియు పరిపాలనకి మూల స్థానం అవడం వల్ల ఈ నగరం ఒక ప్రధాన నగరంగా పరిగణించబడుతుంది. రాష్ట్రం లో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా గుర్తించబడిన ఈ నగరం లో ఎన్నో విద్యాసంస్థలు అలాగే పరిపాలనా సంస్థలు ఉన్నాయి.
ప్రాచీనత మరియు నూతనత్వం
గుంటూరు నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 500 ఈ నగరం యొక్క చరిత్ర ఉంది. ఇంత సుదిర్ఘమైన చరిత్ర మూలాలు కలిగిన నగరం ఏదీ దక్షిణ భారత దేశంలో కనబడదు. ఇంతకు పూర్వం భట్టిప్రోలు అనే రాజ్యం ప్రస్తుతం గుంటూరు అనబడే ప్రాంతం లో ఉండేది. ఈ విషయం 922 నుండి 929 ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి చాలుక్యాన్ రాజు మొదటి అమ్మరాజా కి చెందిన శిల్పాలు అలాగే చెక్కడాలలో నిరూపితమయ్యింది. 1147 నుండి 1158 సమకాలిన ప్రాంతానికి సంబంధించిన శిల్పాలలో గుంటూరు పేరు కూడా చెప్పబడినది. ఈ శిల్పాల ద్వారా గుంటూరు నగరం ఇదివరకు గార్థపూరి అనే సంస్కృత పేరు తో పిలువబడినదని తెలుస్తోంది. గార్థపూరి అంటే చుట్టూ సరస్సులచే కప్పబడిన ప్రాంతం అని అర్ధం.
యూరోపెయన్ ల రాకతో గుంటూరు నగరం యొక్క ఆధునిక చరిత్ర ప్రారంభమయ్యింది. ఇది ఒక కొత్త శకానికి దారి తీసింది. తద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఈ గుంటూరు నగరానికి లభించింది. నిజానికి ఈ నగరం యొక్క అభివృద్దికి ఆశ్చర్యపోయిన ఫ్రెంచ్, వారి సైనికదళాల ప్రధాన కేంద్రంగా 1752 లో గుంటూరు ని ఎంచుకున్నారు. ఆ తరువాత, నిజాముల చేత అలాగే హైదర్ అలీ చేత ఈ నగరం పాలించబడినది. 1788 లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యం గా చేసుకున్నారు. బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ ప్రాంతం ముఖ్య వ్యవసాయక కేంద్రంగా తయారయింది. అందువల్ల 1890 లో రైల్వే ట్రాక్స్ పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ నగరం యొక్క అభివృద్ధి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. గుంటూరు లో సాంకేతిక అభివృద్ధి అలాగే విద్యా అభివృద్ధి తో ఎన్నో దక్షిణ భారత నగరాలు పోటీ పడలేకపోతున్నాయి.








