TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Kadapa, Andhra Pradesh

కిష్కిందకాండ

హిందూ మత ఇతిహాసమైన రామాయణం ప్రకారం, రామాయణం లోని ఏడు కాండల లో ఒకటైన కిష్కిందకాండ భాగం కడప జిల్లాలో ఉన్న వొంటిమిట్ట అనే ప్రాంతంలో జరిగింది. కడప ప్రధాన నగరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ వొంటిమిట్ట నగరం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రసిద్ది చెందిన గండి అనే గ్రామం కడప కి సమీపంలో ఉంది. హనుమంతునికి అంకితమివ్వబడిన ఈ ఆలయంలో ఉన్న హనుమంతుల వారి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీ రాముల వారే స్వయంగా మలచారని భక్తుల నమ్మకం. బాణాలు కొన్ని ఉపయోగించి హనుమంతుల వారి విగ్రహాన్ని ఒక రాతిపై శ్రీ రాములవారు మలచారని అంటారు. సీతమ్మ వారిని కనిపెట్టినందుకు హనుమంతులవారికి గౌరవార్ధం శ్రీ రాముడు ఈ విగ్రహాన్ని మలచారని అంటారు.

దీనిని రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక మజిలీ గా ప్రస్తుత కాలంలో కడప ని పేర్కొనవచ్చు. అమీన్ పీర్ దర్గా, భగవాన్ మహావీర్ మ్యూజియం, చాంద్ ఫిరా గుంబద్, దెవునికడప ఇంకా మసీద్-ఎ-అజాం వంటి ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి.

ఏడాది పొడవునా ఉష్ణ వాతావరణం ఈ ప్రాంతం లో ఉంటుంది. తీవ్రమయిన ఎండాకాలం, పాక్షికంగా ఉండే శీతాకాలం తో పాటు మూడు నెలల కాలం వరకు ఉండే వర్షాకాలం లో నమోదయ్యే సాధారణ వర్షపాతాలు ఈ కడప ప్రత్యేకత.

వాయు, రైలు, రోడ్డు మార్గం ద్వారా కడపకి సులభంగా చేరుకోవచ్చు. నగరం నడిబొడ్డు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ నగరంలో దేశీయ విమానాశ్రయం ఉంది. ముంబై - చెన్నై లైన్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో అనేక రైళ్ళు తరచుగా వస్తూ ఉంటాయి. చక్కటి రోడ్డు రవాణా మార్గం ద్వారా ఈ నగరం రాష్ట్రం లో ని మిగతా నగరాలకు అనుసంధానమై ఉంది. కడపకి చేరుకునేందుకు, క్యాబ్స్ అలాగే బస్సులు అందుబాటులో కలవు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Andhra Pradesh