దుర్గ భవానికి చెందిన ఏడుపాయల దుర్గ భవాని గుడి, మెదక్ పట్టణంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు దగ్గరలో ఉంది. దుర్గ మాత దేవాలయానికే కాక ఈ ప్రాంతం సహజ సిద్ధమైన ప్రత్యేక అమరిక గల రాళ్ళకు ప్రసిద్ది. వేరొక ప్రాంతంలో కలిసే మంజీరా నది ఏడు ప్రవాహాలుగా చీలిపోయేది కూడా ఈ ప్రాంతం లోనే. తెలుగు పదం ఏడుపాయలు అంటే ఏడు ప్రవాహాలు అని అర్ధం.

ఒక పురాణ గాథ ప్రకారం మహాభారత కాలం లో అర్జునుని మనవడు జనమేజయుడు తన తండ్రిని ఒక శాపం నుండి విముక్తుడ్ని చేయడానికి సర్పయాగం లేదా పవిత్రాగ్నిలో సర్పాలను వదిలే యాగాన్ని చేశాడు. ఈ సర్పయాగం ఈ దేవాలయ ప్రాంతంలో చేశాడు. వంతెన నిర్మించ దలచినప్పుడు మంజీరా నది లోపలి పొరలలో ఒక మందమైన బూడిద పొర కనబడిందని తెలుపుతారు.
శివరాత్రి రోజున జరిగే ఉత్సవం జాతరకు లక్షలాది మంది భక్తులు పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా విచ్చేస్తారు.
English content not yet available — showing Telugu original.








