మెదక్ చాల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా అవడంతో ఈ పట్టణానికి అనేక మంది ప్రజలు ప్రక్క రాష్ట్రాల నుండి వస్తారు. సాయిబాబా భక్తులు నిర్మించిన ఒక దేవాలయం ఈ పట్టణంలో ఉంది. మెదక్ దగ్గరలో చిన్న గ్రామం గొట్టం గుట్టలో ఒక అందమైన సరస్సు, అనేక అందమైన దేవాలయాలు ఉన్నాయి. పక్షులు, వన్య మృగాలు ఉండే పోచారం అడవి, వన్యప్రాణి అభయారణ్య౦ యువ పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది, కాని ఒకప్పుడు హైదరాబాద్ నిజాం నవాబులకు ఇది వేటాడే ప్రదేశంగా ఉపయోగపడేది.
చాల ప్రసిద్ది చెందిన వేరొక పర్యాటక కేంద్రం సింగూర్ డాం, ఇది స్థానిక ప్రజలకు విహారయాత్రకు ప్రసిద్ధ కేంద్రం. మెదక్ పట్టణానికి అతి దగ్గరలో ఉండటం వలన నిజాంసాగర్ డామ్ కూడా తరుచుగా సందర్శించే విహార యాత్ర కేంద్రం. ఈ డామ్ ను మంజీరా నది పై నిర్మించారు. మంజీర వన్యప్రాణి, పక్షుల అభయారణ్యం మెదక్ పట్టణానికి చాల దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం మొసళ్ళకు దేశంలోనే ప్రసిద్ది. ఈ అభయారణ్య౦ అనేక వలస పక్షులకు నివాసం, సీజన్లో సందర్శిస్తే మీరు వీటిలో అనేక రకాలను చూడవచ్చు.
మెదక్ పర్యటనకు ఆహ్వానించే పండుగలు
మెదక్ లో చుట్టుపక్కల అనేక చారిత్రిక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీ సరస్వతి క్షేత్ర దేవాలయం, వేలుపుగొండ శ్రీ తు౦బురనాథ దేవాలయం, ఏడుపాయల దుర్గాభవాని గుడి ఎంతో ప్రసిద్ది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు మెదక్ పట్టణానికి విచ్చేయడానికి ఈ దేవాలయాలు ఒక కారణం. పండుగల సమయంలో పోటెత్తే లెక్కలేనంత మంది భక్తులు, పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించే పనిలో ఈ పట్టణం సతమతమౌతుంది. ఈ పట్టణంలో హిందువుల జనాభా ఎక్కువైనప్పటికీ అన్ని పండుగలను అదే విధమైన భక్తి, ఆరాధనతో జరుపుకొంటారు. ఈ పట్టణం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం కావడం ఒక చిన్న అద్భుతంగా ఉంటుంది.








