పానగల్ సోమేశ్వర ఆలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లా లో భాగమైన పానగల్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాద్ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చరిత్రకారుల ప్రకారం, పానగల్ కాకతీయ రాజుల రాజధానిగా ఉన్నప్పుడు అభివృద్ది చెందిన పట్టణం. కాకతీయులు ఈ ప్రాంతాన్ని11వ శతాబ్దంలో కొంత కాలం పాటు తమ రాజధానిగా చేసారు. అదే సమయంలో ఈ గ్రామంలో వారు ఈ దేవాలయాన్ని నిర్మించారు.
ఈ దేవాలయం 66 స్తంభాల గొప్ప నిర్మాణం. ఈ స్తంభాలపై అంతర్భాగమైన అందమైన చెక్కడాలు ఉన్నాయి. మండపానికి ఎదురుగా మధ్యలో ఒక నంది విగ్రహం ఉంది. ఇక్కడ ఆలయం లోపల శివుని విగ్రహం ఉంది. దేవాలయ గోడల పైన గొప్ప హిందూ పురాణాలు రామాయణ, మహాభారత దృశ్యాలను చూడవచ్చు.
English content not yet available — showing Telugu original.








