నిజామాబాద్ దాని గొప్ప సాంస్కృతికతలకు చరిత్రకు ప్రసిద్ధి. పట్టణ జనాభాలో హిందువులు,క్రైస్తవులు , ముస్లిములు మరియు సిక్కులు కూడా కలరు. అన్ని మతాలవారు సఖ్యతగా వుంటారు. జండా మరియు నీలకంటేస్వర పండుగలు ఇక్కడ అమిత వైభవంగా జరుపుతారు. జండా పండుగ ఆగష్టు మరియు సెప్టెంబర్ లలో సుమారు 15 రోజుల పాటు నిర్వహిస్థారు. నీలకంటేశ్వర పండుగ, రెండురోజుల పాటు జనవరి లేదా ఫిబ్రవరిలలో చేస్తారు.
నిజామాబాద్ మరియు దాని ఆకర్షణలు
పర్యాటకపరంగా నిజామాబాద్ తెలంగాణ పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో శ్రీ హనుమాన్ టెంపుల్, నీల కంటేశ్వర టెంపుల్, ఖిల్లా రామాలయం టెంపుల్, శ్రీ రఘునాథ టెంపుల్, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ మరియు సరస్వతి టెంపుల్ (బాసర వద్ద) వంటి ప్రముఖ దేవాలయాలు కలవు. ఈ టెంపుల్స్ మాత్రమే కాక, ఇతర చారిత్రక , పురావస్తు, వారసత్వ ప్రదేశాలు కూడా కలవు. ఇక్కడ దోమకొండ కోట కలదు. ఇది నేడు శిధిలాలలో ఉన్నప్పటికీ నిజామాబాద్ గత వైభవం తెలుసుకోడానికి తప్పక చూడాలి . పట్టణంలో మరొక కోట నిజామాబాద్ కోట. ఈ కోట కూడా వినోద, విహారాలకు, పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది. పట్టణంలో కల కెంటు మసీదుని అన్ని మతాలవారు దర్శిస్తారు.








