పద్మాక్షి దేవాలయం 12వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో కట్టిన ఒక పురాతన నిర్మాణం. ఇది పద్మాక్షి దేవికి అంకితం చేసిన ఒక ఆలయం. ఇది మతపరమైన ప్రకృతి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను,నగరవాసులను ఆకర్షిస్తున్నది.
ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవొచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు. దీనిమీద ఉన్న చెక్కడాలు మరియు శాసనాలు చూసి, ఇది జైనుల యొక్క స్తూపం అని, జైనుల దేవత క్దలలయకు అంకితం చేసారని ఒక నమ్మకం. సంవత్సరం పొడుగునా వొచ్చే సందర్శకులు ఈ స్తంభం యొక్క ఉపరితలాన్నిచూసి ఆశ్చర్యానందాలతో ఈ కట్టడం వెనుక ఉన్న పనితనాన్ని పొగుడుతుంటారు.
English content not yet available — showing Telugu original.








