🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
📖
Panchatantra

కొంగలు-పాము కథ

komgalu-paamu katha

⏱️ 11 min read

ఒక అడవిలోని చెట్టుపై ఒక కొంగల జత గూడు కట్టుకొని నివశిస్తున్నాయి. వాని పిల్లలను గుడ్లను ఆ చెట్టు కింద పుట్టలోనున్న పామొకటి తినేయసాగింది. పాము బాధ తప్పించుకోడానికి కొంగలు ఉపాయం పన్నాయి. అవి కొన్ని చేపలను తెచ్చి పాము పుట్ట నుండి ముంగిస రంధ్రం వరకూ వేశాయి. రంధ్రం నుండి బయటకు వచ్చిన ముంగిస ఆ చేపలను తింటూ పాము పుట్ట వద్దకు వెళ్ళింది. బయటకు వచ్చిన పామును ముక్కలు ముక్కలుగా చంపింది.

కొంగలు తమ శత్రువైన పాము చచ్చిందని సంతోషించాయి. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పామును చంపిన ముంగిస చెట్టుపైకెక్కి మంచి మాంసం దొరికింది అని కొంగ గుడ్లను, పిల్లలను తేనేసింది. కాబట్టి ఉపాయం ఆలోచించగానే సరి కాదు. దానితో పాటు అపాయాన్ని కూడా గుర్తించాలి. ఉపాయంలో అపాయం ఉందేమో చూసుకోవాలి" అని తండ్రి చెప్పాడు. దుష్టబుద్ధి తండ్రి వినలేదు. చివరకు చేసేది లేక ముసలి తండ్రి చెట్టు తొర్రలో దాగి సాక్ష్యం చెప్పుటకు అంగీకరించాడు.

మరునాడు దుష్టబుద్ధి, సుబుద్ధి, రాజుగారు, వారివెంట కొందరు భటులు, ఊరి పెద్దలు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళారు. రాజు చెట్టుని చూచి "ఓ వృక్షరాజమా! ధనం ఉన్న బిందెను నీ సమక్షంలో సుబుద్ధి, దుష్టబుద్ధి దాచారు కదా! ఆ ధనాన్ని ఎవరు అపహరించారో చెప్పు" అన్నాడు. "ఆ ధనం సుబుద్ధి ఎత్తుకొని పోయినాడు, దుష్టబుద్ధికి ఏమీ తెలియదు" అనే మాటలు చెట్టునుండి వినపడ్డాయి. రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. సుబుద్ధి రాజుని చూచి "మహారాజా! ఇందులో ఏదో మోసమున్నది. చెట్టు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా ఉన్నదా! ఒకవేళ ఉంటే నిజం చెపుతుంది కాని అబద్ధం చెబుతుందా!ఈ చెట్టును చక్కగా పరీక్ష చేయండి. తరువాత తమకు తోచిన తీర్పు చెప్పండి" అన్నాడు. రాజుకు ఆ మాటలు మంచిగానే తోచాయి.

రాజు సేవకులను చెట్టెక్కి చూడమన్నాడు. వారు చూచి చెట్టు మొదట్లో పెద్ద తొర్ర ఉందన్నారు. అందులో ఎండుగడ్డి వేసి నిప్పు పెట్టండి అని వారిని ఆజ్ఞాపించాడు. సేవకులు అలా చేయగానే ఆ వేడికి, పొగకు తట్టుకోలేక దుష్టబుద్ధి తండ్రి ఒళ్ళంతా మంటలు మంటలు అని అరుస్తూ బయటకి వచ్చాడు. "మహారాజా! నన్ను మన్నించండి" అని వాస్తవమంతా రాజుకు చెప్పాడు. రాజు మిత్రద్రోహానికి, దొంగతనానికి పాల్పడిన దుష్టబుద్ధిని శిక్షించి సుబుద్ధికి న్యాయం చేశాడు. పరులకు చెడు చేయాలని తలపెడితే ఎవరు తీసిన గోతిలో వారే పడతారు, దూరపు చూపు లేకుండా ఆలోచన చేస్తే అదే మనకు ముప్పు తెచ్చి పెడుతుంది.

కనుక "ఓ దమనకా! నీవు దుష్టబుద్ధిలాగే నిన్ను నమ్మిన రాజుకు ద్రోహం తల పెట్టావు. ఒకరిని మోసం చేయతలిస్తే వాడే మోసపోవడం ఖాయం. నీకొక కథ చెబుతాను విను అని కరటకుడు ఈ కింద కథను చెప్పడం ప్రారంభించాడు.

📖 More Panchatantra

Advertisement
Sponsored by ATA – American Telugu Association