ప్రకాశం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య దూరంగా వెళ్లిపోయిందన్న మనస్తాపంతో తండ్రి సుధాకర్‌ తన ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..