దేశంలో పోటీ పరీక్షల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతుంది. కొంతమంది పేరెంట్స్ ఏకంగా రూ.30లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024 చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్టం ప్రకారం పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయి.