తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు శనివారం నుంచి యధావిధిగా తిరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్మికులు సమ్మె విరమించనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వంతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించేందుకు కార్మికులు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో బస్సులను శనివారం ఉదయం నుంచి ఎప్పటిలాగే తిప్పనున్నట్లు సమాచారం.