ప్రస్తుత సమాజంలో ఏది తిన్నా, ఏది తాగినా కల్తీ భయం వెన్నాడుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అత్యవసరమైన పోషక భాండాగారం పాలు. సంపూర్ణ ఆహారంగా భావించే పాలను సైతం కొందరు స్వార్థపరులు ధనదాహంతో విషతుల్యంగా మారుస్తున్నారు. పాల దిగుబడి పెంచడానికి, ఎక్కువ సేపు నిల్వ ఉండటానికి డిటర్జెంట్ పౌడర్, యూరియా, స్టార్చ్ వంటి భయంకరమైన రసాయనాలను కలుపుతున్నారు.