అనకాపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ఆరోగ్య చిట్కాలను నమ్మి, ఉమ్మెత్త ఆకులను కూరగా వండుకు తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తెలియని మొక్కలను ఆహారంగా తీసుకోకూడదని, నిపుణుల సలహా లేకుండా సోషల్ మీడియా చిట్కాలను గుడ్డిగా నమ్మకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.