శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల రక్తానికి ప్రతీకారంగా, సరిహద్దులు దాటి భారత్ జరిపిన ఈ మెరుపు దాడులతో శత్రువులు గజగజ వణికిపోయారు. ఏడాది పూర్తైన తరుణంలో ప్రధాని మోదీ మన సైన్యం పరాక్రమాన్ని కొనియాడారు.