Yashasvi Jaiswal: శ్రీలంకతో రెండో టెస్టులో అసితా ఫెర్నాండోతో యశస్వి జైస్వాల్ గొడవ వివాదాస్పదంగా మారింది. ఔటైన తర్వాత ఫెర్నాండోతో వాగ్వాదానికి దిగిన జైస్వాల్ హెల్మెట్‌తో అతడి దగ్గరకు వెళ్లారు. ఈ ఘటనపై మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పరిశీలన చేస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం జైస్వాల్‌పై మ్యాచ్ ఫీజు కోత లేదా డిమెరిట్ పాయింట్లు పడే అవకాశం ఉంది.