
హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తప్పు ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాళేశ్వరాన్ని బిఆర్ఎస్ హయాంలో ఎందుకు మళ్లీ నిర్మించలేదని ప్రశ్నించారు? ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు గోదావరిలో పోశారని, కన్నెపల్లి నీళ్లు ఎత్తి పోయకపోతే 50 వేల మందితో పంపులు ఆన్ చేస్తామంటున్నారని విప్ ఆది శ్రీనివాస్ తెలియజేశారు. బిఆర్ఎస్ లో హయాంలో పంపు హౌస్ రెండు సార్లు మునిగిందని, అన్నారం బ్యారేజ్ సాంకేతికంగా బలహీనంగా ఉందని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఎటిఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం చేపట్టారని, అనుమతులు లేవనే సాకుతో తుమ్మిడిహట్టి వద్ద చేపట్టలేదని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.












