అమరావతి:  ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రం మార్కపురం జిల్లాలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడింది.  తుమ్మలబైలు గ్రామశివారులో ఆర్టిసి   బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. పది  మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ౩౦ మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి మార్కపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం  జరిగినట్లు  తెలుస్తోంది. పోలీసులు ఘటనా    స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో  బస్సును బయటకు తీశారు.