న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెకెఆర్.. డిసిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఢిల్లీకి ఓపెనర్లు రాహుల్, నిస్సాంకాలు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 49 పరుగులు జోడించారు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో రాహుల్(23) ఔట్ అయ్యాడు. కానీ నిస్సాంక మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, మరో ఎండ్ నుంచి అతనికి సరైన సహకారం అందండం లేదు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్‌లో నిస్సాంక(46), స్టబ్స్(0) ఉన్నారు.