తిరుమ‌ల‌: హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా మంగ‌ళ‌వారం తిరుమల మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్ర‌హం వ‌ద్ద వేద మంత్రోచ్చారణలు మేళ‌తాళాల నడుమ టిటిడి ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భ‌క్తుల‌కు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీవో సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో స్థానికంగా ఉన్న ప‌లు హ‌నుమాన్ ఆల‌యాల్లో కూడా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.