చెన్నై: టివికె ఎమ్మెల్యే జెసిడి ప్రభాకర్ తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఎమ్మెల్యే రవిశంకర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభాకర్ నామినేషన్‌ను ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రతిపాదించారని, స్పీకర్ పదవికి కేవలం ఆయన నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో, ఆయన ఏకగ్రీవంగా, పోటీ లేకుండా ఎన్నికయ్యారని తాత్కాలిక స్పీకర్ ఎంవి కరుప్పయ్య ప్రకటించారు.

స్పీకర్ ఎన్నికైన తర్వాత ప్రభాకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఏకైక సభ్యుడు, తురైయూర్ నియోజకవర్గానికి చెందిన టివికె ఎమ్మెల్యే రవిశంకర్ అని, ఆయన నామినేషన్‌ను సెంగుట్టయ్యన్ ప్రతిపాదించారని తెలియజేశారు. మరే ఇతర పోటీదారులు లేకపోవడంతో, రవిశంకర్ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని స్పీకర్ తెలిపారు.