ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమాన్ని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి ప్రారంభించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వాణిజ్య సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ సందర్భంగా భారత్ ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొనగా, 21వ శతాబ్దంలో భారతదేశం కీలక ప్రపంచ శక్తిగా అవతరించిందని మాక్రాన్ ప్రశంసించారు. ప్రధాని మోదీతో మాక్రాన్ తీసుకున్న సెల్ఫీ, 'ధురంధర్' చిత్రంలోని పాటను ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.