హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఇంటి డాబాపై గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. నాచారానికి చెందిన శశిధర్‌ అనే ఇంజినీర్ గంజాయికి బానిసై ఉద్యోగం వదిలేశాడు. డబ్బు లేక సొంతంగా 17 గంజాయి మొక్కలు పెంచుతుండగా.. ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు కూడా పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.