
న్యూఢిల్లీ : దేశంలోని ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థల వద్ద సుమారు రూ.98,000 కోట్ల విలువైన ఇన్వెంటరీ నిలిచిపోయిందని వెక్టర్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. మెరుగైన ఇన్వెంటరీ నిర్వహణ ద్వారా ఇందులో రూ.29,000-39,000 కోట్ల వరకు నిధులను తిరిగి సమీకరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్కింగ్ క్యాపిటల్లో విడుదలయ్యే మొత్తంలో రూ.4,000-5,600 కోట్లు ఎంఎస్ఎంఈ రంగం నుంచే సమకూరే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దేశంలోని ఆటో విడిభాగాల తయారీదారుల్లో సుమారు 80 శాతం ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. వెక్టర్ కన్సల్టింగ్ గ్రూప్ రూపొందించిన ‘ది బ్రోకెన్ ఫ్లైవీల్: బిల్డింగ్ ఎ ఫ్యూచర్-రెడీ ఆటోమోటివ్ సప్లై ఎకోసిస్టమ్’ అనే వైట్పేపర్ ప్రకారం.. వినియోగ ఆధారిత సరఫరా విధానాలను అనుసరించే సంస్థలు సాధారణంగా తమ ఇన్వెంటరీని 30-40 శాతం వరకు తగ్గించగలుగుతున్నాయి. తమ అమలు అనుభవాల ఆధారంగా ఈ అంచనాను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ అధ్యయనం కోసం 2026 జూలై-ఆగస్టు మధ్య 21 మంది సీనియర్ పరిశ్రమ ప్రతినిధుల నుంచి సమాచారాన్ని సేకరించారు.








