
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం జెఎసి, కార్మిక నేతల డిమాండ్లు అంగీకరించాలని టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు సూచించారు. ఆర్టిసి సమ్మెపై కేబినెట్ భేటీలో చర్చించాలని అన్నారు. బిజెపి కార్యాలయంలో భగీరథ మహిర్షి జయంతి కార్యక్రమం జరిగింది. భగీరథ మహర్షి చిత్రసటానికి రామచందర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 41 రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చారని, ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు సమ్మె చేపట్టారని తెలియజేశారు. ఆర్టిసి ప్రైవేటుపరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, గతంలో 63మంది కార్మికుల మరణానికి బిఆర్ఎస్ కారణమైందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మూడేళ్లయిందని, కొత్త బస్సులు లేవు..ఉన్న బస్సులను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టిసి కార్మికులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ రావు భరోసా ఇచ్చారు.












