మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్ రోడ్డులోని డిపిఆర్ పంక్షన్ హాల్లో బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్ కుమార్తె భవానీ - అఖిల్ ల వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుకల్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ పాల్గొని నూతన వదూ వరులను ఆశీర్వదించారు. బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, బిఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, కోణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేంద్ర నాద్, గజ్జి మల్లేశ్, జంగ శ్రీనివాస్, పానుగుళ్ల విష్ణు మూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.