
హైదరాబాద్: సీడ్ గణేశుడితో అటు పుణ్యకార్యం.. ఇటు ప్రకృతికి మేలని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సీడ్ గణేశుడిని పూజించండి..పచ్చదనాన్ని పెంచండని సూచించారు. హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేషా ప్రతిమలను చిరంజీవి ఆవిష్కరించారు. విగ్రహంలో వేప, చింత లాంటి దేశీయ విత్తనాలు ఉండేలా చూడాలని చిరంజీవి కోరారు. పివొపి విగ్రహాలతో జలకాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, మట్టి వినాయకులను పూచించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. వినాయక చవితికి పర్యావరణ పరిరక్షణకు అందరూ సీడ్ గణేశాను పూచించాలని చిరంజీవి పిలుపునిచ్చారు.








