నవతెలంగాణ – హైదరాబాద్ : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూలు జిల్లాల్లోని అక్కడక్కడా మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
The post నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.












