తమిళనాడు ముఖ్యమంత్రి జోసెప్ విజయ్ నీట్ (NEET) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. నీట్ వంటి పరీక్షల వల్ల రాష్ట్రాల విద్యా హక్కులకు భంగం కలుగుతోందని , భారీగా ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద, గ్రామీణ విద్యార్థులకు ఈ పరీక్ష శాపంగా మారిందని ఆయన అన్నారు. విభిన్న రాష్ట్రాల్లో విభిన్న విద్యా విధానాలు (Syllabus) ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.12 వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి సిఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. నీట్ నుండి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఆయన తన మద్దతును ప్రకటించారు.