బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో కలకం రేగింది. ప్రధాని సభ జరిగే చోటు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. రెండు జెలిటెన్ స్టిక్స్‌ని పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ వాటిని అక్కడి నుంచి తరలించారు. వాటిని అక్కడ పెట్టినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధాని మోడీ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జెలిటన్ స్టిక్స్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని అన్నారు.