
హైదరాబాద్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదవారం హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇటీవల శస్త్ర చికిత్స జరిగి విశ్రాంత తీసుకుంటున్న ఎపి డిప్యూటి పవన్కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్, ఆయన భార్య అన్నా కొణిదెల మోడీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అన్నా కొణిదెల షేర్ చేశారు. ‘‘ప్రధాని మా ఇంటికి వచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజును జీవితంలో మర్చిపోలేను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు ప్రామిస్ చేశాను’’ అని క్యాప్షన్ పెట్టారు.














