
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం జరగనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలిపక్షాల ఉప నాయకులు పాల్గొనే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇంఛార్జిల నియామకం సహా పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు.















