
ఐపిఎల్లో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ జోస్ బట్లర్లు విఫలమయ్యారు. నితీశ్ సంధు 14 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఓపెనర్ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్లు అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సాయి సుదర్శన్ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వాషింగ్టన్ అద్భుత ఇన్నింగ్స్తో అలరించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుందర్ 33 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్తో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో సాకిబ్, ప్రఫుల్ హింగె రెండేసి వికెట్లను పడగొట్టారు.














