మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి బ్రాడ్ కూపర్ నుంచి ఇరాన్‌పై సైనిక చర్యలపై నివేదిక అందుకోనున్నారు.

Axios నివేదిక ప్రకారం, ఇరాన్ కీలక మౌలిక వసతులపై “చిన్న కానీ తీవ్ర” దాడుల ప్రణాళిక సిద్ధమైంది.

ఈ బ్రీఫింగ్ ద్వారా ట్రంప్ మళ్లీ పెద్ద స్థాయి యుద్ధ చర్యలను ప్రారంభించాలా అనే దానిపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చర్చలు నిలిచిపోవడంతో వాటిని ముందుకు తీసుకెళ్లడం లేదా యుద్ధానికి ముగింపు పలకడానికి కీలక దెబ్బ ఇవ్వడం లక్ష్యంగా ఉండవచ్చు.

ఇందులో భాగంగా ప్రపంచానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించడం కూడా ఒక ఆప్షన్‌గా ఉంది. దీనికి భూసైనిక చర్యలు అవసరమయ్యే అవకాశం ఉంది.

అలాగే, ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునే ప్రత్యేక ఆపరేషన్ కూడా చర్చలో ఉంది.

ప్రపంచ దృష్టి ఇప్పుడు అమెరికా తదుపరి నిర్ణయంపై నిలిచింది.