ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల కతాయెబ్ సయ్యద్ అల్-షుహదా (KSS) మిలీషియా నాయకుడు హషీమ్ వాయెలీని పట్టిస్తే అమెరికా $10 మిలియన్ల భారీ నజరానా ప్రకటించింది. ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు వాయెలీ కారణమని ఆరోపించింది. ఇతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. సమాచారం ఇచ్చిన వారికి రక్షణ, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.