హిందూ పండుగలలో అక్షయ తృతీయకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుది. చాలా పవిత్రమైన పండుగల్లో ఇదొక్కటి. ఈ పండుగ చాలా శుభప్రదమైనది. వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈరోజు చాలా మంది బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం ఒక సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు, అంతే కాకుండా వీటిని కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.