లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మొత్తంగా 528 ఓట్లు పోలవగా.. అనుకూలంగా 298, ప్రతికూలంగా 230 మంది ఓటేశారు. ఈ బిల్లు నెగ్గాలంటే టు థర్డ్‌ మెజార్టీగా 352 ఓట్లు రావాల్సి ఉండగా.. 298 మాత్రమే రావడంతో.. బిల్లు వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు.