భారతదేశంలో క్యాన్సర్ మహమ్మారి కోరలు చాస్తోంది. ముఖ్యంగా పురుషులలో నోటి క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జరిపిన తాజా ప్రపంచ విశ్లేషణలో వెల్లడైంది. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 డేటా ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో భారతదేశంతో పాటు పలు జి20 దేశాలలో ఈ ధోరణి కనిపిస్తోంది. పొగాకు వాడకం, ముఖ్యంగా నమిలే రకం పొగాకు ఉత్పత్తుల వల్ల భారత్‌లో ఈ ముప్పు అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.