Sacred Origins of Lalita Sahasranama: తమిళనాడులో ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్మే పవిత్ర క్షేత్రాల్లో ఒకటి తిరుమీయచూర్ లలితాంబిక ఆలయం. లలితా సహస్రనామ పారాయణాలతో నిత్యం మార్మోగే ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరతాయని, అనారోగ్యాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా, అమ్మవారు శ్రీ లలితాంబికా దేవిగా శ్రీచక్రంపై ఆసీనురాలై భక్తులకు కటాక్షం ప్రసాదిస్తారు.