అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో భూ వివాదాల కారణంగా గ్రామ తాగునీటి బోరుకు కొందరు తాళం వేయడంతో గ్రామస్తులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో తాగునీరు లేక అల్లాడుతున్నారు. పంచాయతీ అధికారులు తాళాలు తీసినా, మళ్ళీ వేస్తున్నారు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.