ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యుద్ధంలో తీవ్ర గాయపడి, కృత్రిమ కాలుతో అజ్ఞాతంలో ఉన్నారు. బహిరంగంగా కనిపించకుండా, కేవలం రాతపూర్వక సందేశాలతో పాలన సాగిస్తున్నారు. గాయాల కారణంగా బలహీనంగా కనిపించకూడదనే ఉద్దేశంతోనే ఆయన తెరవెనుక ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా, పాలన సైనిక జనరల్స్‌కు మళ్లుతోందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.