నేపాల్ ఎయిర్‌లైన్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వివాదాస్పద నెట్‌వర్క్ మ్యాప్ భారత్-నేపాల్ మధ్య చిచ్చు రేపింది. ఈ మ్యాప్‌లో భారత భూభాగాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం తీవ్ర దుమారానికి దారితీసింది. భారతీయుల నుండి వెల్లువెత్తిన ఆగ్రహం, సోషల్ మీడియా నిరసనల నేపథ్యంలో ఎయిర్‌లైన్ యాజమాన్యం దిగివచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పింది.