రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామపెద్దల సమక్షంలో జరిగిన భూమి విక్రయ ఒప్పందం మోసంగా మారి ఓ వికలాంగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కొండాపురం బాబాయ్య తన 1 ఎకరం 20 గుంటల భూమిని రూ.1,30,000కి రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కొనుగోలుదారులు డబ్బు చెల్లించకపోవడంతో ఆవేదన చెందాడు.