దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల కల.. మెడికల్ సీటు సాధించడమే లక్ష్యంగా నేడు నీట్ పరీక్ష జరగనుంది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నిబంధనల విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.