పలు రాష్ట్ర ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 మేర పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.